Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొలంబో : ఎల్టీటీఈతో శ్రీలంక ప్రభుత్వం పోరు ముగిసిన తర్వాత ఈస్థాయిలో ప్రజలు మృత్యువాత పడటం ఇదే మొదటిసారి. ముష్కరుల చర్యను భారత్తో సహా ప్రపంచదేశాలు తీవ్రంగా ఖండించాయి. అయితే తాజా ఘటన శ్రీలంకలోని పర్యాటకంపై తీవ్ర ప్రభావం చూపనున్నది. పర్యాటక స్థలాలకు శ్రీలంక పెట్టింది పేరు. ప్రస్తుతం వేసవికాలం కావడంతో శ్రీలంకలోని పలు ప్రాంతాలకు విదేశీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చారు. 2018 ఏడాదిలో భారత్తో సహా ప్రపంచదేశాల నుంచి 23లక్షల మంది శ్రీలంకలో పర్యటించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది ఒక్క భారత్ నుంచి 4.50లక్షల మంది శ్రీలంకకు వెళ్లివచ్చారని తెలిసింది. ఈ ఏడాది సుమారుగా 10లక్షల మంది భారతీయులు శ్రీలంకకు వెళ్లబోతున్నట్టు అంచనా. ఈనేపథ్యంలో విదేశీ పర్యాటకుల నుంచి శ్రీలంకకు పెద్దమొత్తంలో ఆదాయం వస్తోంది. 2018లో అక్టోబరునాటికి 363 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ బాంబుపేలుళ్ల నేపథ్యంలో పర్యాటకరంగం తీవ్రంగా ప్రభావితమై, ఆదాయం దెబ్బతింటుందన్న ఆందోళన శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే వ్యక్తం చేశారు.