Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 13మంది మృతి
మెక్సికోసిటి : మెక్సికో తీర ప్రాంతంలోని మినాటిలాన్ నగరంలో ఒక దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో దుండగుడు బార్లో చొరబడి కాల్పులు జరపడంతో 13మంది అక్కడి కక్కడే మరణించారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఏడుగురు పురుషులు, ఒక బాలుడు ఉన్నారని వార్తలు వెలువడ్డాయి. నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ దుండగుడు బార్కు వచ్చి ఎందుకు కాల్పులకు తెగబడ్డా డన్నది తెలియరాలేదు. ఈ ఘటనపై ప్రభుత్వ వర్గాలు ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు.
ఈ ఘటన వెనుకున్నవారి కోసం గాలింపు చేపట్టామని ప్రజా భద్రతా ముఖ్య అధికారి హ్యూజో గిటర్రెజ్ మీడియా కు తెలిపారు. మెక్సికో తీర ప్రాంతంలో పెద్ద ఎత్తున చము రు నిక్షేపాలు ఉండటంతో, వీటిపై పట్టు పెంచుకోవడానికి కొన్ని ప్రయివేటు గ్యాంగ్లు నిత్యం హింసకు పాల్పడుతున్నాయి. మెక్సికోలో రాజకీయ అవినీతి పెద్ద ఎత్తున ఉండటంతో, పలు ప్రయివేటు గ్యాంగ్లు తెరవెనుక బడా రాజకీయవేత్తలతో సంబంధాలు ఏర్పరచుకున్నాయి. చమురు క్షేత్రాలపై పట్టు కోసం ఏడేండ్లుగా మాఫియా, ప్రయివేటు గ్యాంగ్ల మధ్య దాడులు-ప్రతిదాడులు సైతం చోటుచేసుకుంటున్నాయి. ఈనేపథ్యంలో పలు నగరాల్లో ప్రముఖల హత్యలు సైతం పెరిగిపోయాయి.