Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్యారిస్: ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన ఈఫిల్ టవర్ను నిర్మించి బుధవారంతో 130 ఏండ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా టవర్ను రంగు రంగుల లేజర్ లైట్లతో అలంకరించారు. 130 ఏండ్ల ఈఫిల్ టవర్ చరిత్ర ప్రతిబింబించేలా ఈ లైట్లను అమర్చి, వాటికి ఎఫెక్ట్లను జోడించారు. స్థానిక కాలమాన ప్రకారం బుధవారం రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకూ ఈ ప్రదర్శన నిర్వహించినట్టు సమాచారం. ఈ సమయంలో ఈఫిల్ టవర్ మొత్తం మిరుమిట్లు గొలిపే రంగురంగుల విద్యుద్దీపాల మధ్య దేదీప్యమానంగా వెలిగిపోయింది.ఈఫిల్ టవర్ను 1889లో నిర్మించారు. దీని ఎత్తు 324 మీటర్లు కాగా, నిర్మాణానికి 7,300 టన్నుల ఉక్కు వాడారు. ఈ టవర్ను నిర్మించి 130 ఏండ్లయినా ఇంకా దేశ విదేశాల నుంచి దీనికి పర్యటకుల తాకిడి ఏమాత్రం తగ్గలేదు. ఈఫిల్ టవర్ను సందర్శించేందుకు ప్రతి ఏడాది 70 లక్షల మంది పర్యాటకులు వస్తుంటారు.