Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రతా వైఫల్యంతోనే కుటుంబ సభ్యులను కోల్పోయామంటూ కోర్టును ఆశ్రయించిన బాధిత కుటుంబాలు
- రూ.5,612 కోట్ల పరిహారం ఇప్పించాలని అభ్యర్థన
వాషింగ్టన్ : లాస్వేగస్లోని మాండలే బే హోటల్ యజమానిపై కేసు నమోదైంది. 2017లో మాండలే బే హౌటల్లో మారణహోమం జరిగిన సంగతి తెలసిందే. స్టీఫెన్ పాడ్లాక్ అనే ఉన్మాది హోటల్లో బస చేసిన వారిపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 59 మంది మృతి చెందగా, 527 మంది గాయపడ్డారు. అమెరికాలో జరిగిన ఘోరమైన మారణహోమంలో లాస్వేగస్ ఒకటి. తమకు న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబాలు కోర్టును ఆశ్రయించాయి. మాండలే బే హోటల్ యజమానిపై దావా వేశాయి. హోటల్లో భద్రతా వైఫల్యం కారణంగానే తమ బంధుమిత్రులను కోల్పోయామని, యజమాని నుంచి తమకు పరిహారం ఇప్పించాలని పిటిషనర్లు న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. బాధిత కుటుంబాలు 800 మిలియన్ డాలర్ల ( రూ.5,612 కోట్లు ) పరిహారాన్ని ఆశిస్తుండగా, 751 మిలియన్ డాలర్ల ( రూ.5,268 కోట్లు ) పరిహారం చెల్లించేందుకు హౌటల్ యాజమాన్యం అంగీకరించినట్టు ప్రతివాదుల తరుఫు న్యాయవాది రాబర్ట్ ఎగ్టెట్ తెలిపారు. కేసు తదుపరి విచారణ వచ్చేనెలలో చేపట్టనున్నట్టు న్యాయస్థానం వెల్లడించింది. రాజీ కుదుర్చుకునేందుకు న్యాయస్థానం అవకాశం కల్పించింది.