Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్యాంకాక్ : నవజాత శిశువును కాపాడి ప్రశంసలందుకుంటోంది ఈశాన్య థాయిలాండ్లోని ఒక శునకం. నఖాన్ రాచ్ఛసిమా ప్రావిన్స్లోని చంపక్ జిల్లాలోని ఒక క్షేత్రానికి సమీపాన మట్టి గుంతలో ఉన్న ఈ శిశువును గమనించిన పింగ్పాక్ జాతికి చెందిన శునకం..చుట్టూ ప్రక్కల త్రవ్వుతూ అరవడంతో దాని యజమాని గుర్తించి బయటకు తీశారు. శిశువు సొంత తల్లే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. శిశువును పూడ్చిన కొద్ది వ్యవధిలో శునకం గుర్తించినట్టు తెలిపారు. ప్రస్తుతం ఆ శిశువు ఆరోగ్యంగా ఉన్నాడని, అతడిని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించినట్టు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని వెల్లడించారు.