Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనపనార మిల్లు కార్మికుల ఆందోళన
- మూడు నెలలుగా వేతనాలు లేక కార్మికులు అప్పులపాలు
ఢాకా : బంగ్లాదేశ్లోని ప్రభుత్వ జనపనార మిల్లులోని కార్మికుల సమ్మె తీవ్రరూపం దాల్చింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కార్మికులు నిరసనలు, ఆందోళన కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ప్రతీరోజు నిరసన ర్యాలీలు చేపడుతున్నారు. 27 ప్రభుత్వ జనపనార తయారీ మిల్లుల్లోని 80వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. గతమూడు నెలలుగా 'బంగ్లాదేశ్ జ్యూట్ మిల్స్ కార్పొరేషన్' తమకు వేతనాలు చెల్లించటం లేదంటూ వీరంతా సమ్మెకు పిలుపునిచ్చారు. ఆదివారం నాటికి ఈ సమ్మె ఆరోరోజుకు చేరుకుంది.
కనీసం రంజాన్కు ముందుగా తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాల్సిందిగా కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మూడు నెలలుగా తమకు వేతనాలు చెల్లించకపోతే బతికేది ఎలా అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. అధిక వడ్డీకి అప్పులు చేసి రోజులు వెళ్లదీస్తున్నామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ''నాకు రెండు నెలలుగా వేతనం రావటం లేదు. నాలాగే 1950మంది కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. బకాయిలు ఇలా పేరుకుపోతే మా కుటుంబాలు గడిచేది ఎలా?''అని అబుల్ హుస్సేన్ అనే కార్మికుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు.