Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్: దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద ప్రాంతంలోకి అమెరికా యుద్ధ నౌక ప్రెబుల్ ప్రవేశించినట్టు చైనా అధికార మీడియా తన వార్తా కథనాలలో వెల్లడించింది. ఈ ప్రాంతంలో చైనా సార్వభౌమత్వాన్ని సవాలు చేస్తూ ఈ నౌక సంచరించినట్టు మీడియా తన కథనాలలో పేర్కొంది. ఇటువంటి చేష్టల ద్వారా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు చేటు కలిగించ వద్దని చైనా విజ్ఞప్తి చేసింది. కొద్ది రోజుల వ్యవధిలోనే తమ ఉత్పత్తులపై అమెరికా రెండుసార్లు భారీ యెత్తున సుంకాలను పెంచటంతో తీవ్రంగా స్పందించిన చైనా... అమెరికా ఉత్పత్తులపై కూడా భారీగా సుంకాలను పెంచిన విషయం తెలిసిందే. అమెరికా నౌకాదళానికి చెందిన డెస్ట్రాయర్నౌక శుక్రవారం నాడు ఈ ఆపరేషన్ను నిర్వహించినట్టు అమెరికా సైనిక ప్రతినిధి ఒకరు మీడియాకు చెప్పారు.