Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దుబారులో భారతీయుని దాతృత్వానికి..
- ఆకలితీరుస్తున్న పిసిటి హ్యూమానిటి
దుబాయ్ : రంజాన్ మాసంలో అబుదాబిలో ఆకలి తీర్చేందుకు ఒక భారతీయుడు నిర్వహిస్తున్న దాతృత్వ సంస్థ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకుంది. జోగిందర్ సింగ్ సలారియా అనే భారతీయుడు పిసిటి హ్యూమానిటి అనే దాతృత్వ సంస్ధను స్థాపించాడు. ఆ సంస్ధ ద్వారా రంజాన్ మాసంలో దుబారు ప్రజలకు ప్రతిరోజూ శాఖాహార ఇఫ్తార్ను అందిస్తున్నాడు. దుబారు ఇండిస్టియల్ పార్క్లోని తాను పనిచేస్తున్న పెహల్ ఇంటర్నేషనల్ కంపెనీ ఆవరణలో ఇఫ్తార్ విందును ఇస్తున్నాడు. ప్రతి రోజూ కిలోమీటర్ల పొడవున ప్రజలు బారులు తీరి ఇఫ్తార్ విందును స్వీకరిస్తున్నారు. జోగిందర్ సింగ్ నిర్వహిస్తున్న సంస్ధ చేపట్టిన ఇఫ్తార్ విందు కార్యక్రమం తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకుంది. అబుదాబిలో శనివారం ''లాంగెస్ట్ లైన్ ఆఫ్ హంగర్ రిలీఫ్ ప్యాకేజ్'' గా గిన్నిస్ బుక్లో నమోదైంది. ''ప్రజల జీవితాల్లో పరివర్తను, చిరునవ్వును తీసుకు వచ్చే ప్రయాణంలో ఇది మాకు ఒక మధురమైన క్షణం. ఈ రికార్డు సాధించడంతో పాటు ప్రజలకు స్వచ్ఛమైన శాఖాహారాన్ని అందించి వారిని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, జంతువులను పరిరక్షించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ సందేశాన్ని జన బాహుళ్యంలోకి తీసుకెళ్ళడంలో ప్రజలు మాతో చేతులు కలపడం ఎంతో సంతోషంగా ఉంది'' అని సలారియా ఒక ప్రకటనలో తెలిపారు.