Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : అమెరికాలో టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో, ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. గంటకు 143 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఒక్లాహౌమా ప్రాంత ప్రజలు టోర్నడోల కారణంగా ఇండ్లకే పరిమితమయ్యారు. ఇదే ప్రాంతంలో గత ఆరేండ్ల కిందట టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. ఈ ప్రకృతి విపత్తులో 24 మంది మృతి చెందారు. టోర్నడోల కారణంగా వాణిజ్య, విద్యా సముదాయాలు మూతపడ్డాయి. పలు విమాన సర్వీసులను రద్దు చేసుకున్నట్టు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణం కారణంగా విమానాలను ఎయిర్పోర్టుల్లోనే నిలిపివేశామని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.