Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెర్లిన్ : జర్మనీలో మూనిచ్ నగరంలోని రెండు ప్రయివేట్ పాఠశాలలకు మంగళవారం బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో, అప్రమత్తమైన యాజమాన్యం విద్యార్థులను, ఉపాధ్యాయులను స్కూల్ నుంచి బయటకు పంపించింది. సమాచారం అందుకున్న బాంబు స్క్వాడ్ హుటాహుటిన ఆయా పాఠశాలలకు చేరుకొని ముమ్మర తనిఖీలు చేపట్టింది. అయితే, స్కూళ్లలో బాంబులు లేవని బాంబుస్క్వాడ్ తేల్చిచెప్పడంతో యాజమాన్యాలు ఊపిరిపీల్చుకున్నాయి. ఇది కచ్చితంగా ఆకతాయిల పనేనని బెర్లిన్ పోలీసులు అనుమానిస్తున్నారు. పాఠశాలలకు వచ్చిన ఈమెయిల్స్, ఫోన్కాల్స్పై దర్యాప్తు చేపడుతున్నారు.