Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇబ్బందుల్లో లిబియన్లు
ట్రిపోలి : లిబియా రాజధాని ట్రిపోలిలో తిరుగుబా టుదారులు విధ్వంసం సృష్టిస్తున్నారు. లిబియ న్లపై దాడులకు పాల్పడి భయబ్రాం తులకు గురిచేసిన తిరుగుబాటు దారులు తాజాగా ట్రిపోలి నగరంలోని నీటి సరఫరా పైపులను పగులగొట్టారు. దీంతో, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొ ంటున్నారు. అయితే, నీటి సరఫరా పునరుద్ధరించాలంటే మరికొన్ని రోజుల సమయం పట్టే అవకాశముంది. పోలీస్ అధికారులు, ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపిన వివరాల ప్రకారం... సహారా ప్రాంతానికి పశ్చిమ దిశలో ఉన్న నీటి ట్యాంకులను కొందరు దుండగులు పేల్చేశారు. నీటి పైపులను పగులగొట్టారు. దీంతో, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొ ంటున్నారు. ఈ దాడికి పాల్పడినట్టు లిబియా నేషనల్ ఆర్మీ అనే తిరుగుబాటుదారు సంస్థ ప్రకటించుకుంది. కాగా, గతనెలలో ట్రిపోలిలో ప్రారంభమైన ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ అల్లర్లలో 510 మంది మృతిచెందగా, 2500 మంది గాయపడ్డారు.