Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండోసారి బాధ్యతలు చేపట్టనున్న సిట్టింగ్ ప్రెసిడెంట్
- భారీగా రిగ్గింగ్ జరిగినట్టు ఆరోపణలు
- ఆందోళకు దిగిన విపక్షనేతలు...
భారీగా బలగాల మోహరింపు
జకార్త: ఇండోనేషియాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జోకో విడోడో మరోసారి విజయం సాధించారు. గతనెల17న దేశ వ్యాప్తంగా అధ్యక్ష ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో 15కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల ఫలితాలను సోమవారం అర్థరాత్రి దేశ ఎన్నికల సంఘం విడుదల చేసింది. విపక్ష నేత మాజీ ఆర్మీ జనరల్, ప్రత్యర్థి ప్రబోవో సుబియాంటోపై జోకో విడోడో రెండోసారి విజయం సాధించారని ఎన్నికల అధికారులు ప్రకటించారు. విడోడో నేతృత్వంలోని ఇండోనేషియా డెమోక్రటిక్ పార్టీకి 55.5శాతం ఓట్లు వచ్చాయి. ప్రబోవో సుబియాంటోకు 44.5శాతం ఓట్లు వచ్చినట్టు ఈసీ ప్రకటించింది. అయితే, ఈ ఎన్నికల్లో ప్రబోవో ఓటమిపాలు కావడంతో ఆయన మద్దతుదారులు అర్థరాత్రి దేశ రాజధాని జకార్తలో ఆందోళకు దిగారు. ఎన్నికల్లో విడోడో పెద్ద మొత్తంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, రిగ్గింగ్కు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. విడోడో విజయాన్ని తాము అంగీకరించేది లేదని, తమకు జరిగిన అన్యాయంపై కోర్టుకు వెళ్తామని ప్రబోవో తెల్చిచెప్పారు. పలు ప్రాంతాల్లో హింస చెలరేగే అవకాశం ఉన్నందున ముందస్తుగా జకార్తలో 40వేల మంది పోలీసులను మోహరించారు. పోలింగ్ ప్రారంభం కాకముందు నుంచే రిగ్గింగ్ ఆరోపణలు దుమారం రేపిన విషయం తెలిసిందే.
పొరుగున ఉన్న మలేసియాలో ఓ గోదాం దగ్గర వేలాదిమంది బ్యాలెట్ పత్రాలు పట్టుకుని బారులుతీరినట్టు కనిపిస్తున్న ఓ వీడియో బయటకు రావడంతో దానిపై ఇండోనేసియా ఎన్నికల సంఘం దర్యాప్తు చేపట్టింది.ఆ గోదాం దగ్గర ఉన్నవారిలో ఎక్కువ శాతం ప్రస్తుత అధ్యక్షుడు జోకో విడోడోకు అనుకూలంగా బ్యాలెట్ పత్రాలపై మార్కు చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. మలేషియాలో దాదాపు పది లక్షల మంది ఇండోనేసియన్ ఓటర్లు ఉంటారని అంచనా వేసి వాటిపై దర్యాప్తు చేపడు తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఇండోనేషియాలో గతనెల21న దేశ అధ్యక్ష పీఠం, స్థానిక సంస్థల వరకు ఒకేరోజు ఎన్నికలు నిర్వహించిన విషయం విధితమే.