Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్టు ఆధారాలు
- రంజాన్ తర్వాత శిక్ష అమలు చేయనున్నట్టు వెల్లడి
రియాద్ : ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన ముగ్గురు ప్రముఖ స్కాలర్స్లను సౌదీ ప్రభుత్వం ఉరితీయనున్నట్టు మిడిల్ ఈస్ట్ ఐ మీడియా సంస్థ బుధవారం ప్రకటించింది. రంజాన్ పండుగ తర్వాత ప్రభుత్వం శిక్ష అమలు చేయనుందని తెలిపింది. ఈ మేరకు ఓ కథనాన్ని ప్రచురించింది. దీనిలోని వివరాల ప్రకారం....షేక్ సల్మాన్ అల్ అవాద్, అవాద్ అల్ ఖార్నీ, అలీ అల్ ఒమారీ అనే ముగ్గురు విద్వాంసులు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్టు సౌదీ ప్రభుత్వానికి ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ నేపథ్యంలో ముగ్గురు స్కాలర్స్కు ఉరిశిక్ష అమలు చేయనుంది. వీరిలో అల్ అవాద్కు అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ ఇస్లామిక్ సంస్కరణవాదిగా పేరుంది. ఐరాస సైతం ఆయన్ను పలుమార్లు ప్రశంసించింది. ఆయనకు ట్విట్టర్లో 1.3కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అల్ ఖార్నీ గొప్ప విద్యావేత్త, మత బోధకుడు, రచయిత. అల్ఒమారీ ఓ ప్రసారకుడు. వీరంతా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరికి ఉరిశిక్ష విధించే తేదీకి సంబంధించిన వివరాలను సౌదీ ప్రభుత్వం ప్రకటించలేదు. ఈ ముగ్గురు విద్వాంసులను సౌదీ ప్రభుత్వం 2017 సెప్టెంబర్లో అరెస్ట్ చేసినట్టు మిడిల్ ఈస్ట్ ఐ మీడియా సంస్థ ప్రకటించింది. రియాద్ నగరంలోని క్రిమినల్ స్పెషల్ కోర్టులో వీరిని విచారించినట్టు తెలిపింది. వీరి అరెస్ట్ను ఐరాస, ఆమ్నెస్టీ ఇంటర్నెషనల్తో పాటు పలు అంతర్జాతీయ హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించినట్టు తెలిపింది.