Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు మృతి, 12 మందికి గాయాలు
మొగధీషు : సోమాలియా రాజధాని మొగధీషు నగరంలో కారు బాంబు పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. ఈ ఘటనకు పాల్పడినట్టు అల్ షాబాబ్ ఉగ్రసంస్థ ప్రకటించుకుంది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...దల్జిర్కా ప్రాంతంలోని పోలీస్ చెక్పోస్ట్ వద్ద కారు బాంబు పేలింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. పేలుడు ధాటికి పరిసర ప్రాంతాలన్నీ దద్దరిల్లాయి. చెక్పాయింట్ సమీపంలో నివసిస్తున్న ప్రజలంతా ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు దల్జిర్కా ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. పరిసర ప్రాంతాల్లో ముమ్మర సోదాలు నిర్వహించాయి. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాయి. కారు బాంబు పేలుడుకు పాల్పడ్డ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు.