Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విడోడో గెలుపును నిరసిస్తూ
- కొనసాగుతున్న నిరసనలు
- రిగ్గింగ్ జరిగిందంటూ ఆరోపణలు
- రీకౌంటింగ్ నిర్వహించాలని నిరసనకారులు డిమాండ్
- విడోడో మద్దతుదారులకు, ప్రత్యర్థులకు మధ్య జరిగిన అల్లర్లలో ఆరుగురి మృతి
జకార్తా : ఇండోనేషియాలో ఆగ్రహ జ్వాలలు భగ్గుమన్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జొకోవి విడోడో గెలుపొందారు. రెండోసారి ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే, విడోడో గెలుపును నిరసిస్తూ విపక్ష నేతలు ఆందోళనకు దిగా రు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. ఓట్ల రీకౌంటింగ్ చేపట్టాలని డిమాండ్ చేశారు. జకార్తాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఎన్నికల్లో ఓటమిపాలైన మాజీ మిలిటరీ జనరల్ ప్రబోవో సుబియాంటో, విడోడో మద్దతుదారులకు మధ్య అల్లర్లు జరుగుతున్నాయి. ఇరు వర్గాలు ఒకరిపై మరొ కరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ అల్లర్లలో ఆరుగురు మృతిచెందగా, 200 మందికి పైగా గాయపడ్డారని పోలీస్ అధికారులు ధ్రువీ కరించారు.జకార్తాలో బుధ వారం వాణిజ్య, విద్యా సంస్థలు మూతపడ్డాయి. అల్లర్లను అదుపులోకి తెచ్చేందుకు 20వేల మంది పోలీసులను సమస్యాత్మక ప్రాంతాల్లో మోహరించి నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
సామాజిక మాధ్యమాలపై తాత్కాలిక నిషేధం :
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్య మాలపై నిషేధం విధించినట్టు న్యాయ, సామాజిక వ్యవహారాల మంత్రి విరాంటో తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు ప్రసారం కావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొందని అన్నారు. దీంతో, ఘర్షణలు హింసాత్మకంగా మారాయని అన్నారు. ఈనేపథ్యంలో సామాజిక మాధ్యమాలపై నిషేదం విధించామని అన్నారు.
విడోడోను అభినందించిన జిన్పింగ్ :
ఇండోనేషియా అధ్యక్ష ఎన్నికల్లో రెండో సారి గెలుపొందిన విడోడోను చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అభినందించారు. ఇరుదేశాల మధ్య దశాబ్దాల నుంచి ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతున్నాయని, విడోడో మరోసారి పదవీ బాధ్యతలు చేపట్టడంతో ఈ సంబంధాలు మరింత బలోపేతమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.