Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లీటర్ పెట్రోల్ ధర రూ.346 !
హరారే : జింబాబ్వేలో చమురు ధరలు భారీగా పెరిగా యి. దీంతో, ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టా డుతున్న జింబాబ్వేలో చమురు ధరలు మిన్నంటడంతో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. రవాణా చార్జీలు పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే పెరిగిన చమురు ధరలను తగ్గించేలా చర్యలు చేపట్టాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.
జింబాబ్వే ఎనర్జీ రెగ్యులేటరీ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం...లీటర్ 1.42 డాలర్లు ( రూ.99) ఉన్న పెట్రోల్ ధర ఒక్కసారిగా 4.97డాలర్లకు ( రూ.346) పెరిగింది. లీటర్ డీజిల్ ధర 4.89 డాలర్లకు ( రూ.340) పెరిగింది. జింబాబ్వేలో ఆందోళనలు మరోసారి ఉధృతమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో జింబాబ్వేలో చమురు ధరలు భారీగా పెరిగాయి. దీంతో, ప్రజలు లక్షలాదిగా వీధుల్లోకి చేరుకొని ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.చమురు ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు, బ్యానర్లు చేబూని ప్రభుత్వ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఈ అల్లర్లలో 17 మంది నిరసనకారులు మృతిచెందారు. ప్రజల నిరసనలపై స్పందించిన ప్రభుత్వం చమురు ధరలను తగ్గించింది.