Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హువావేపై ఆంక్షలను వ్యతిరేకిస్తున్న యువత,
సోషల్ మీడియా యూజర్లు
- చైనాలో యాంటీ ఆపిల్ ఉద్యమం
- ట్రంప్ సర్కార్పై మండిపడుతున్న నెటిజన్లు
- ఆపిల్ ఉత్పత్తులను నిషేధించాలని పిలుపు
బీజింగ్ : చైనాలోని మొబైల్ ఫోన్స్ తయారీ దిగ్గజ సంస్థ హువావేను ఎలాగైనా దారికి తెచ్చుకొనేందుకు ప్రయత్నిస్తున్న అమెరికాకు చైనా యువత భారీ షాకిచ్చింది. ఈ మేరకు అక్కడి సోషల్ మీడియా యూజర్లు, యువత కీలక నిర్ణయం తీసుకుంది. హువావేకు చైనా యువత బాసటగా నిలిచారు. దేశవ్యాప్తంగా ఆపిల్ ఉత్పత్తులను నిషేధించాలంటూ పిలుపు నిచ్చారు. ప్రంపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ అయిన హువావే ఉత్పత్తులు, టెక్నాలజీపై ఆంక్షలు విధించిన ట్రంప్ ప్రభుత్వంపై అక్కడి యువత మండిపడుతోంది.
ట్విటర్, వైబోలాంటి సోషల్ మీడియా వేదికల్లో ఆపిల్ ఉత్పత్తులను నిషేధించాలని ట్వీట్స్ పెడుతున్నారు. ఈ పోస్టులకు మిలియన్ల కొద్దీ లైకులు, షేర్లు లభిస్తున్నాయి. దీంతో, చైనాలో యాంటీ ఆపిల్ ఉద్యమం ఊపందుకుంది. హువావేపై ట్రంప్ సర్కార్ కావాలనే వేధింపులకు పాల్పడుతోందని యూజర్లు మండి పడుతున్నారు. ఆపిల్ ఐఫోన్లకు బదులుగా హువావే ఫోన్లను కొనుగోలు చేయాలని నెటిజన్లు కోరుతున్నారు. మరోవైపు ఈ నిర్ణయం స్వల్పకాలంలో చైనాలో ఆపిల్ అమ్మకాలను దెబ్బతీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే, తాజా పరిణామంపై వ్యాఖ్యానించడానికి ఆపిల్ తిరస్కరించింది. దీంతో,అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం మరింత ముదురుతున్న ఆందోళన నెలకొంది. కాగా హువావేపై ఆంక్షలను తాత్కాలికంగా నిలిపిస్తున్నట్టు అమెరికా వాణిజ్య శాఖ ప్రకటించింది. ఈఏడాది ఆగస్టు 19వరకు ఆంక్షలను సడలించినట్టు పేర్కొంది. గూగుల్, ఇన్ఫినియాన్ కంపెనీలతో లావాదేవీలు రద్దు చేసుకున్నట్టు హువావే ప్రకటించింది.