Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చొరబాటుకు ప్రయత్నించినవారి కోసం గాలింపు
పారిస్ : భారత దేశ భద్రతకు అత్యంత కీలకమైన రాఫెల్ యుద్ధ విమానాల సాంకే తిక సమాచారాన్ని దొంగిలించే ప్రయత్నం జరిగినట్టు తెలుస్తోంది. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఫ్రాన్స్లోని భారతదేశ రాఫెల్ ప్రాజెక్ట్ నిర్వహణ బృందం కార్యాలయంలోకి చొరబడినట్టు వార్తలు వెలువడ్డాయి. గూఢచర్యంలో భాగంగా ఈ ఘటన చోటుచేసు కుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్రాన్స్ డసాల్ట్ ఏవియేషన్ కార్యాలయానికి సమీపంలోనే ఈ కార్యాలయం కూడా ఉంది. ఫ్రాన్స్ నుంచి మనదేశం 36 రాఫెల్ యుద్ధ విమానాలను కొంటున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. భారత వాయు సేన వర్గాలు ఓ వార్తా సంస్థకు తెలిపిన వివరాల ప్రకారం భారత దేశ రాఫెల్ ప్రాజెక్ట్ నిర్వహణ బృందం కార్యాలయం పారిస్ శివారు ప్రాంతంలో సెయింట్ క్లౌడ్ అనే చోట ఉంది. కొంతమంది అనుమానితులు ఈ కార్యాలయంలో చొర బడ్డారనీ, అయితే యుద్ధ విమానాల సాంకేతిక సమాచారమున్న హార్డ్ డిస్క్ కానీ, పత్రాలు కానీ దొంగతనానికి గురికాలేదనీ తెలుస్తోంది. చొరబడినవారి ఉద్దేశాలేమిటో తెలుసుకునేందుకు దర్యాప్తు జరుగు తోంది. కెప్టెన్ స్థాయి అధికారి నేతృత్వంలో 'రాఫేల్ ప్రాజెక్టు టీమ్' పారిస్లో పని చేస్తోంది. ఈ యుద్ధ విమానాలను నడపటంలో శిక్షణ, విమానాల తయారీ వంటి అంశాలను ఈ బృందం పర్యవేక్షిస్తోంది. ఈ కార్యాలయంలో డబ్బు, విలువైన వస్తువులు ఉండవు. అయినప్పటికీ కొందరు చొరబడినట్టు తెలియడంతో యుద్ధ విమానాల సాంకేతిక సమాచారాన్ని చోరీ చేయడమే లక్ష్యంగా వారు వచ్చినట్టు అనుమానిస్తున్నారు. దీనిపై ఫ్రాన్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.