Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20లక్షల మందికి పైగా అవకాశం
- రెండు చిప్లను పంపిస్తామన్న నాసా
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష సంస్థ 'నాసా' ప్రజలందరికీ అరుదైన అవకాశం ఇస్తోంది. 2020లో అరుణ గ్రహంపైకి ప్రయోగించ బోయే రోవర్లో ప్రజల పేర్లు కూడా పంపించడానికి నిర్ణయిం చింది. ఈఏడాది సెప్టెంబర్30 లోపు ఇష్టమైనవారు తమ పేర్లను పంపించాలని నాసా సైన్స్ మిషిన్ డైరెక్టరేట్ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ థామస్ జుర్బుచెన్ తెలిపారు.
రెండు సిలికాన్ చిప్లపై 20లక్షల మందికిపైగా పేర్లు చెక్కుతామని, జులై 2020న అంగారకుడిపైకి పంపించే సైంటిస్ట్ రోవర్లో వీటిని పంపిస్తామని పేర్కొంది. ఈ రోవర్ ఫిబ్రవరి 2021నాటికి కుజ గ్రహంపైకి చేరుతుందని నాసా తెలిపింది. కాలిఫోర్నియాలోని జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీలో ఎలక్ట్రాన్ కాంతికిరణాల సాయంతో, ఒక్కో చిప్పై మానవ వెంట్రుక వెడల్పులో వెయ్యో వంతు ఉండే అతిచిన్న అక్షరాలు చెక్కనున్నారు. నాసా ప్రయోగించనున్న స్వయంచాలిత రోబో.. శాస్త్రవేత్తలా వ్యవహరిస్తుంది. ఈ రోవర్ వెయ్యి కిలోల బరువు ఉంటుంది. అరుణగ్రహం మట్టిలో సూక్ష్మజీవుల ఉనికి ఉందేమో పరీక్షిస్తుంది. అక్కడి వాతావరణం, భూభౌతిక లక్షణాలను అంచనా వేయడానికి వీలుగా మట్టిని సేకరిస్తుంది. దీన్ని భవిష్యత్తులో భూమిపైకి తీసుకొస్తారు. భవిష్యత్తులో మానవులను అంగారకుడిపైకి పంపించడానికి ఈ వివరాలన్నీ ఉపయోగపడనున్నాయి.