Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14 మంది మృతి
కాబూల్ : అఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 14 మంది మృతి చెందారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...హెల్మాండ్, తూర్పు కునార్ ప్రావిన్స్ల్లో ఏకకాలంలో వైమానిక దాడులు జరిగాయి. ఈదాడుల్లో 14 మంది మృతి చెందారు. ఈ దాడులకు పాల్పడినట్టు ఏ ఉగ్రసంస్థ కూడా ప్రకటించుకోలేదు. గతంలో తాలిబన్లు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడికి పాల్పడింది కూడా తాలిబన్లేనని అధికారులు అనుమానిస్తున్నారు. అఫ్ఘాన్లోని ఐరాస సహాయక బృందాలు వెల్లడించిన వివరాల ప్రకారం...భద్రతా బలగాలకు, తాలిబన్లకు మధ్య అఫ్ఘాన్లో భీకరపోరు కొనసాగుతోంది. ఈఏడాది జనవరి1 నుంచి మార్చి31నాటికి ఇరువర్గాల మధ్య జరిగిన దాడుల కారణంగా 145 మంది మృతి చెందగా, 83 మంది గాయపడ్డారు.