Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇస్లామాబాద్ : ఖండాంతర క్షిపణిని పరీక్షించినట్టు పాకిస్థాన్ ఆర్మీ వెల్లడించింది. తాము పరీక్షించిన క్షిపణికి వార్హెడ్లను మోసుకెళ్లే సామర్థ్యముందని తెలిపింది. భారత్తో శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ ప్రకటించిన మరుసటి రోజే పాకిస్థాన్ ఖండాంతర క్షిపణిని పరీక్షించడం చర్చనీయాంశమైంది. పాక్ ఆర్మీ వెల్లడించిన వివరాల ప్రకారం...గురువారం షాహీన్-2 అనే క్షిపణిని పరీక్షించారు. ఈ క్షిపణికి 1500 కిలోమీటర్ల దూరం ప్రయాణించే సామర్థ్యం ఉన్నది. సైనిక శిక్షణలో భాగంగానే తాము క్షిపణి పరీక్ష నిర్వహించినట్టు ఆర్మీ స్ట్రాటెజిక్ ఫోర్సెస్ కమాండ్ తెలిపింది.
ఈఏడాది ఫిబ్రవరి14న పుల్వామాలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని పాక్కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రసంస్థ సభ్యులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈదాడిలో సూసైడ్ బాంబర్ సహా 40 మంది మృతిచెందారు. 35 మంది గాయపడ్డారు. జైషే మహ్మద్ ఉగ్రసంస్థ దాడికి ప్రతీకారంగా ఫిబ్రవరి26న పాక్ భూభాగంపై భారత్ వైమానిక దాడులు నిర్వహించింది. పాక్లోని జైషే మహ్మద్ ఉగ్రసంస్థ శిబిరాన్ని ధ్వంసం చేసింది. ఈ ఘటన అనంతరం ఇరుదేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉగ్రసంస్థలను పాక్ ప్రోత్సహించినట్టయితే ప్రత్యక్ష దాడులకు దిగుతామని భారత సైన్యం హెచ్చరించింది.