Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభినందనలు తెలిపిన ఐరాస
న్యూఢిల్లీ : శాంతి భద్రతల పరి రక్షణలో ఐక్యరాజ్య సమితి (ఐరాస)కి భారత్ అందించిన సహకా రానికి యూఎన్ ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెరస్ కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాతీయంగా శాంతి భద్రతలను కాపాడటంలో ము ఖ్యంగా భారత మహిళలు స్ఫూర్తినిచ్చే పాత్ర పోషించారని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 6,400మంది భారత శాంతి పరిరక్షక దళాలు గొప్ప సేవలు అందించారని గుటెరస్ పేర్కొన్నారు. అంతర్జాతీయ శాంతి భద్రతల దినోత్సవం సందర్భంగా శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కార్య క్రమానికి భారత్ నుండి అనేకమంది ప్రముఖులు హాజరయ్యారు. అనంత రం ఈ లక్ష్యాలను సాధించడంలో ప్రాణాలను కోల్పోయిన వారికి ఐరాస నివాళులు అర్పించింది. శాంతి భద్రతల పరిరక్షణలో ఐక్యరాజ్య సమితికి అపారమైన సహకారం అందించిన భారత్ ప్రముఖులకు ముఖ్యంగా మహిళలకు తన కృతజ్ఞతలు తెలుపుతున్నానని గుటెరస్ పేర్కొన్నారు. ఐరాస చార్టర్కు కట్టుబడటంలో భారత్ ఉదాహరణగా నిలిచిందని గుటెరస్ పేర్కొంటూ ఆరంభంలో 'నమస్తే' అంటే అభివాదం చేశారు. ఈ కార్యక్రమానికి వివిధ దేశాల రాయబారులు, దౌత్యవేత్తలు తదితరులు హాజరయ్యారు. భారత్లో మొత్తం 32 శాతం మహిళా పోలీ స్ సిబ్బంది ఉందని, వారందరికి 'ధన్యవాదాలు' అంటూ ముగించారు.