Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీలంక ప్రధాని విక్రమసింఘే
కొలంబో : శ్రీలంకలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదాన్ని తుద ముట్టిస్తానని ఆ దేశ ప్రధాని రణిల్ విక్రమసింఘే శపథం చేశారు. ప్రజా సంఘాలు, ట్రేడ్ యూని యన్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదం మరో సారి బుస కొట్టకుండా నిరోధించేందుకు తగిన భద్రతా చర్యలు చేపడతామన్నారు. తీవ్రవాదాన్ని, మత ఛాందసవాదాన్ని సమర్థించవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. గత నెలలో జరిగిన ఆత్మాహుతి దాడులతో ప్రమేయం ఉన్నవారిని భద్రతా దళాలు అరెస్టు చేశాయన్నారు. అయితే ఇక్కడితో ఉగ్రవాదం ముగిసిపోయినట్టు కాదన్నారు. దేశంలో మరోసారి ఉగ్రవాదం తలెత్తకుండా చూసేందుకు ఉగ్రవాద వ్యతిరేక చర్యలు చేపట్టవలసిన అవసరం ఉందని చెప్పారు. ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు తీసుకోవలసిన చర్యల గురించి ప్రభుత్వం చర్చలు జరుపుతోందని తెలిపారు. గత నెలలో మూడు చర్చిలు, మూడు హోటళ్లపై జరిగిన దాడులకు ఏయే వ్యవస్థల వైఫల్యాలు కారణమో తెలుసుకునేందుకు పార్లమెంటరీ సెలెక్ట్ కమిటీని నియమించినట్టు తెలిపారు.