Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్యాంకాక్: థాయ్ లాండ్ మాజీ ప్రధాని జనరల్ ప్రేమ్ టిన్సులనోండా (98) ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఈ మేరకు రాజప్రాసాదం అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. టిన్సులనోండా 1980 నుంచి 1988 మధ్యకాలంలో మూడు సార్లు ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం మహారాజు సలహాదారుల కమిటీలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. 2016లో థారులాండ్ రాజు భుమిబోల్ మృతి చెందిన తర్వాత దేశ పరిపాలనలో కీలక భూమిక పోషించారు. తాజాగా ఇదే నెలలో జరిగిన భుమిబోల్ తనయుడు విజయాలంగ్కర్న్ పట్టాభిషేకం కార్యక్రమంలో ముఖ్య పాత్ర పోషించారు.
అయితే ప్రేమ్ టిన్సులానోండా మృతికి గల కారణాలను రాజకుటుంబం ఇప్పటి వరకు ప్రకటించలేదు. రాజవంశ పాలనకు వ్యతిరేకంగా చాలా సార్లు తిరు గుబాట్లు జరిగాయి. వీటన్నింటినీ ప్రేమ్ చాకచక్యంగా అణచి వేశారు. అయితే ప్రేమ్ మృతితో దేశంలో 2014 తిరుగుబాట్ల తర్వాత తొలిసారిగా ఎన్నికలు జరగబోయే సూచనలు కన్పిస్తున్నాయి. మిలటరీ ప్రభుత్వ వ్యతిరేక పార్టీకి చెందిన ప్రయూత్ ఛాన్ ఓచాను ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. మిలటరీ పాలనకు, ప్రజాస్వామ్య పాలనకు మధ్య వారధిగా ప్రేమ్ టిన్సులనోండా వ్యవహరించేవారని అక్కడి ప్రజలు చెబుతుంటారు.