Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇరు దేశాల సంబంధాలపై సంభాషణ
ఇస్లామాబాద్ : ఎన్నికల్లో గెలుపొంది మరోసారి భారత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నరేంద్రమోడీకి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ ఫోన్ చేశారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. ఫలితాలు వచ్చిన అనంతరమే ట్విట్టర్ ద్వారా మోడీకి శుభాకాంక్షలు తెలిపిన ఇమ్రాన్.. మరోసారి స్వయంగా ఫోన్ చేసి తన ఆత్మీయతను చాటుకున్నారు. పొరుగు దేశాల మధ్య ఉండాల్సిన దౌత్యాన్ని గుర్తు చేస్తూ పాకిస్తాన్, ఇండియాలలో ఉన్న పేదరికంపై సంయుక్తంగా పోరాడాల్సిన ఆవశ్యకతను మోడీకి ఇమ్రాన్ గుర్తు చేశారు. ఇరు దేశాలు అవలంబించాల్సిన కొన్ని విషయాలపై కూడా చర్చించినట్టు సమాచారం. ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలోనే ''మోడీయే మరోసారి ఇండియా ప్రధానమంత్రి కావాలి. మోడీ అయితేనే కశ్మీర్ లాంటి దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభిస్తుంది'' అని ఇమ్రాన్ వ్యాఖ్యానించారట.
ఏం మాట్లాడుకున్నారు?
ఇరుదేశాల మధ్య పరస్పర నమ్మకం పెరగాలనీ, ఈ ప్రాంతంలో శాంతి సామరస్యాలు పెరగాలంటే ఉగ్రవాదం లేకుండా చేయాలనీ ఈ సందర్భంగా ప్రధాని మోడీ, పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు తెలియ జేశారట. ఫోన్ చేసి తనకు అభినందనలు తెలిపిన ందుకు ఇమ్రాన్ఖాన్కు కృతజ్ఞతలు చెప్పారట. ఇరు దేశాల ప్రజల కోసం కలిసి పనిచేద్దామని ఇమ్రాన్ఖాన్ ఈ సందర్భంగా ప్రధాని మోడీకి స్నేహహస్తం అందించారని తెలిసింది. ఇరుదేశాల్లో నెలకొన్న పేదరికాన్ని నిర్మూలించడానికి, అభివృద్ధిని కొనసాగించడానికి, భారత్తో కలిసి పనిచేయడానికి ఇమ్రాన్ఖాన్ సంసిద్ధతను వ్యక్తం చేశారు.