Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు మృతి
వాషింగ్టన్ : అమెరికాలో టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఒక్లాహౌమాలో ఇద్దరు మృతిచెందగా, మరో 29 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీరం వెంబడి 165 మైళ్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. పలు ప్రాంతాల్లోని ఇండ్ల పైకప్పులు గాల్లో ఎగిరిపోయాయి. వేలాది మంది నిరాశ్రయు లయ్యారు. మరికొందరు గల్లంతయ్యారు. పంటపొలాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. టోర్నడోల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.