Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15 మంది మృతి
సావోపాలో: బ్రెజిల్లోని అమెజొనాస్ రాష్ట్రంలోని జైల్లో ఖైదీల మధ్య ఘర్షణ నెలకొనడంతో 15 మంది మృతి చెందారు. స్థానిక కాలమానం ప్రకారం.. ఆదివారం ఉదయం 11 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... ములాఖత్ సమయంలో ఖైదీల మధ్య చిన్నపాటి ఘర్షణ చెలరేగింది. అది కాస్త ఉద్రిక్తంగా మారింది. ఖైదీలు ఒకరిపై మరొకరు దాడికి దిగారు. కొందరిని గొంతు నులిమి చంపేశారు. ఈ ఘటనలో 15 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. ఘర్షణకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. బ్రెజిల్ జైళ్లలో అల్లర్లు సాధారణమే. ఇక్కడి జైళ్లలో సామర్థ్యానికి మించి రెట్టింపు సంఖ్యలో ఖైదీలు ఉంటారు. దీంతో గ్యాంగ్ వార్లు, ఘర్షణలు, జైళ్లను తప్పించుకునేందుకు ఖైదీలు యత్నించడం వంటివి తరచూ జరుగుతుంటాయి. గతేడాది సెప్టెంబరులో కొందరు సాయుధ దుండగులు ఓ జైలు బయట పేలుళ్లకు పాల్పడి 92 మంది ఖైదీలను విడిపించుకుపోయారు. 2017లో బ్రెజిల్ జైలులో దాదాపు 20గంటలపాటు ఘర్షణ చెలరేగింది. ఈ అల్లర్లలో 56 మంది మృతి చెందారు. 2016లో బ్రెజిల్ జైళ్లలో 7.2లక్షల మంది ఖైదీలు శిక్ష అనుభవిస్తున్నారు. ఒక్కో బారక్లో ఖైదీల సంఖ్య అధికంగా ఉండటంతో ఘర్షణలు ఎక్కువగా జరుగుతున్నాయి.