Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెల్బోర్న్ : ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న భారతీయలు 69వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి పంద్రాగస్టు పండుగ చేసుకున్నారు. ఆస్ట్రేలియాలో వందలమంది భారతీయులు మెల్బోర్న్లోని ఫెడరేషన్ జెండా వందనానికి వచ్చారు. భారత హైకమీషనర్ వనవదీప్ సూరి జెండాను ఎగురవేశారు. ఈ వేడుకలకు బాలీవుడ్ నడుటు అనిల్ కపూర్ హాజరయ్యారు. విదేశాల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు చేసుకోవటం ఎంతో ఆనందాన్ని కల్గిస్తుందని అనిల్ కపూర్ చెప్పారు. బ్యాంకాక్లో భారత రాయబారి హర్షవర్ధన్ సింగ్లా జాతీయ పతకాన్ని ఎగురవేశారు. రాష్ట్రపతి ప్రణబ్ సందేశాన్ని చదివి వినిపించారు. స్కూలు పిల్లలు పలు ప్రదర్శనలు చేశారు. ఈ కార్యక్రమానికి 750 మంది హాజరయ్యారు. వియత్నాం రాజధాని హనోరులో భారత రాయబారి ప్రీతి శరన్ జెండా ఎగుర వేశారు. మూడు వందల మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈసారి వేడుకలకు ఎక్కవమంది వచ్చారని శరన్ చెప్పారు. మెక్రోసాఫ్ట్, ఐబిఎన్, నోకియా వంటి మల్టీ నేషన్స్ కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగులు హాజరయ్యాని తెలిపారు. జపాన్ రాజధాని టోక్యోలో దీపా వాద్వా జెండాను ఎగురవేశారు. 500 మంది భారతీయలు వేడుకలకు విచ్చేశారు. సింగపూర్లో పంద్రాగస్టు వేడుకలను ఘనంగా జరిపారు. వెయ్యిమందికిపైగా హాజరైన ఈ కార్యక్రమంలో హైకమీషనర్ విజరు సింగ్ ఠాకూర్ త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేశారు. అసోసియేషన్ ఆఫ్ సౌతీస్ట్ ఎసియన్ నేషనన్స్ (ఎఎస్ఇఎఎన్) దేశాల్లోని రాయబార కార్యాలయాల్లో భారత జెండాలను ఎగురవేశారు. మయన్మార్, సింగపూర్, మలేషియా, వియత్నాం, ఫిలిఫ్పైన్స్, లావోస్, కాంబోడియా, ఇండోనేషియాలలోని భారత ప్రజలు స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.