Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 18 మంది మృతి
సావోపోల్ : బ్రెజిల్లో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సావోపో నగరంలో శుక్రవారం రాత్రి భీకరమైన కాల్పులు చోటు చేసుకున్నాయి. ముసుగులు ధరించి వచ్చిన కొంతమంది దుండగులు... వివిధ ప్రాంతాల్లో వరుసగా ఈ కాల్పులకు తెగబడ్డారు. ఓ వాహనంలో వచ్చిన వీరంతా...అక్కడున్నవారిని వివరాలు అడిగి మరీ కాల్చి చంపినట్టు తెలుస్తోంది. ఒసాస్కో భారౌరీ ప్రాంతాల్లో ఈ కాల్పులు సంభవించాయి. అక్కడ వున్న ఓ బార్లోకి చొరబడ్డ అగంతకులు...అక్కడున్నవారిని కాల్చి చంపారు. సీసీ టీవీల్లో ఈ దృశ్యాలు రికార్డుకాగా, ప్రత్యక్ష సాక్షులు కూడా ఇదే విషయాన్ని పోలీసులకు వివరించారు. ఈ మధ్యకాలంలో జరిగిన హింసాత్మక ఘటనల్లో ఇది చాలా దారుణమైన ఘటన అని, మృతుల సంఖ్య కూడా ఎక్కువేనని స్థానిక పోలీస్ అధికారులు వెల్లడించారు. అత్యున్నత స్థాయి అధికారులతో విచారణ జరిపిస్తామన్నారు. ఇంతమందిని కాల్చి చంపిన ఘటన ఇంతకుముందెప్పుడూ తాను చూడలేదని ఫోరెన్సిక్ నిపు ణులు మీడియాకు తెలిపారు. కాగా బ్రెజిల్ నగరం రియోడిజెనిరోలో చుట్టూ వున్న పేదల బస్తీల్లో ఇటువంటి ఘటనలు అప్పుడప్పుడు జరగటం అక్కడ సర్వసాధారణంగా మారింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ముఠాలు ఆధిపత్యం కోసం ఘర్షణ పడుతూ వుంటాయని బిబిసి రిపోర్ట్ చేసింది.