Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జపాన్ను కోరిన చైనా
బీజింగ్ : గతంలో రెండవ ప్రపంచ యుద్ధంలో దురాక్రమణ రీతుల్లో వ్యవహరించినందుకు నిజాయితీగా క్షమాపణ చెప్పాల్సిందిగా జపాన్ను చైనా కోరింది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి 70ఏళ్ళు పూర్తయిన సందర్భంగా జపాన్ ప్రధాని షింజో అబె చేసిన ప్రకటన పట్ల చైనా స్పందించింది. ఆనాడు జపాన్ సైన్యం ప్రారంభించిన యుద్ధం వలన ఇబ్బందులు పడిన దేశాల్లోని ప్రజలకు జపాన్ ప్రధాని నిజాయితీగా క్షమాపణలు చెప్పాలని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హువా చునీంగ్ తెలిపారు. జపాన్ సైన్యం చేపట్టిన ఈ యుద్ధం చైనా, ఇతర ఆసియా దేశాల ప్రజలకు విషాదాన్ని తీసుకువచ్చిందని హువా తెలిపారు. చరిత్ర పట్ల సరైన అభిప్రాయం, సక్రమమైన వైఖరి అవలంబించుకుంటేనే జపాన్, ఇతర ఆసియా దేశాల మధ్య మరింత మెరుగైన, పటిష్టమైన సంబంధాలు నెలకొనబడతాయని ఆమె తెలిపారు. చరిత్ర నుండి గుణపాఠాలు నేర్చుకున్న చైనా మరింత మెరుగైన భవిష్యత్తును నిర్మిస్తోందని చెప్పారు. పొరుగు ఆసియా దేశాల, అంతర్జాతీయ సమాజం విశ్వాసాన్ని చూరగొనేందుకోసం శాంతియుత అభివృధ్ధి పంథాను అనుసరించేందుకు చర్యలు తీసుకోవాలని జపాన్ను చైనా కోరింది.