Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాంజుల్ : గాంబియాలో సైనిక తిరుగుబాటుకు కుట్ర పన్నిన కేసులో 8 మందిని స్థానిక న్యాయస్థానం దోషులుగా తేల్చి 9ఏండ్ల జైలుశిక్ష విధించింది. వీరంతా మాజీ అధ్యక్షుడితో కలిసి కుట్రపూరితంగా తిరుగుబాటుకు ప్రయత్నించారని న్యాయమూర్తి వెల్లడించారు. రాజద్రోహం, సైనిక తిరుగుబాటుకు పాల్పడిన కేసుల్లో వీరికి శిక్ష విధించినట్టు తీర్పు వెలువరించారు. గాంబియా అధ్యక్షుడు అదామా బారోను గద్దె దించాలని 2017లో తిరుగుబాటు చెలరేగిన సంగతి తెలిసిందే. సైనికుల్లోని ఓ వర్గం ఈ తిరుగుబాటుకు తెరలేపారు. అధికార దాహంతో ఉన్న మాజీ అధ్యక్షుడు యహ్యా జామె సైనిక తిరుగుబాటుకు ఆజ్యం పోశారు. ఆయన గాంబియాను 22ఏండ్ల పాటు పాలించారు.