Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోర్టుగల్ విదేశాంగ మంత్రి
బ్రసెల్స్ : యూరోపియన్ యూని యన్ (ఈయూ) సమైఖ్యతకే మెజారిటీ ఓటర్లు మొగ్గు చూపుతున్నారని పోర్టుగల్ విదేశాంగ మంత్రి అగస్టా సాంటోస్ సిల్వా అభిప్రాయపడ్డారు. యూరోపియన్ యూనియన్ ఐక్యతను కోరుకుంటున్న పార్టీలకే ఈయూ ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టారని అన్నారు. స్టెఫ్ బ్లాక్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మీడియాతో అగస్టా మాట్లాడారు. ఈయూను చిన్నాభిన్నం చేయాలని భావిస్తున్న పార్టీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందన్నారు. ప్రజాతీర్పును తాను స్వాగతిస్తున్నానని అన్నారు. ఈయూ కౌన్సిల్కు, ఈయూ పార్లమెంట్కు ఇది ఊహించని పరిణామని అన్నారు. కాగా, ఈయూలో 28దేశాలకు సభ్యత్వం ఉన్నది. 751 మంది సభ్యులున్న ఈయూ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఈనెల23 నుంచి 26 వరకు జరిగిన ఎన్నికల్లో 42.7కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.