Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిందితుడి సహా ముగ్గురి మృతి , 18 మందికి గాయాలు
టోక్యో : జపాన్లోని కవాసకీ నగరంలో ఓ ఉన్మాది వీరంగం సృష్టించాడు. కత్తితో విద్యార్థులపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఓ మైనర్ బాలికతో పాటు మరో యువకుడు మృతి చెందారు. 18 మంది విద్యార్థులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...కవాసకీ నగరంలోని ఓ పాఠశాల సమీపంలో ఉన్మాది బీభత్సం సృష్టించాడు. బస్స్టాప్ వద్ద బస్సు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్న విద్యార్థులపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం ఉన్మాది తన మెడపై కత్తితో పొడుచుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ఉన్మాదిని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా మార్గం మధ్యలో ఉన్మాది మృతి చెందినట్టు ధ్రువీకరించారు. ఉన్మాది దాడికి పాల్పడ్డ కారణం తెలియరాలేదు. ఈ ఘటన జరిగిన పాఠశాల చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటనపై జపాన్ ప్రధాని షింజో అబె తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపడతామని అన్నారు. .