Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 11కి చేరిన పర్వతారోహకుల మృతుల సంఖ్య
ఖాట్మండ్ : ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖ రంపై ట్రాఫిక్ జామైంది. వేసవి నేపథ్యంలో పర్వతారోహకులకు వాతావరణం అనుకూలంగా ఉంటుందనే కారణంతో ఎంతో మంది పర్వతారోహకులు ఇక్కడికి చేరుకున్నారు. దీంతో, శిఖరం ఎక్కే మార్గం పొడవునా రద్దీ బాగా పెరిగి పోయింది. ఈ సీజన్లో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కే ప్రయత్నంలో మృతిచెంది నవారి సంఖ్య మంగళవారం నాటికి 11కి చేరుకుందని నేపాల్ పర్యాటక శాఖ వెల్లడించింది. మృతుల్లో ముగ్గురు భారతీయులు ఉన్నారు. అమెరి కాకు చెందిన క్రిస్టోఫర్ జాన్ కులిష్ (62) అనే న్యాయవాది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే క్రమంలో సోమవారం మృతిచెందారు. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేందుకు ఈ ఏడాది 381 మందికి నేపాల్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. శిఖరాన్ని చేరుకునే క్రమంలో పర్వతారోహకులు క్యూ కట్టారు. దీంతో, శిఖరాన్ని చేరుకోవాలంటే క్యూలోనే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తున్నది. గడ్డకట్టే చలిలో గంటల తరబడి వేచిచూడాల్సి రావడంతో పర్వతారోహకులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. పైగా, ఆక్సిజన్ స్థాయిలు కూడా తక్కువగా ఉండటంతో పర్వతారోహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.