Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండోసారి ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టనున్న ఏపీసీ నేత
అబూజ : నైజీరియా అధ్యక్ష ఎన్నికల్లో మహ్మద్ బుహారీ (75) గెలుపొందారు. దీంతో, ఆయన రెండోసారి అధ్యక్ష పీఠాన్ని అలంకరించనున్నారు. గతంలో నైజీరియా ఆర్మీ జనరల్గా పనిచేసిన బుహారీకి ప్రజాసమస్యలపై పూర్తి అవగాహన ఉన్నది. దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెడతానని అన్నారు. నిరుపేదల అభ్యున్నతి కోసం రాజీలేని పోరాటం చేస్తానని అన్నారు. నైజీరియాలో రెండు వర్గాల మధ్య చెలరేగిన అల్లర్లను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తానని బుహారీ భరోసా ఇచ్చారు. తన గెలుపుకు సహకరించిన ఓటర్లకు, నేతలకు, కార్యకర్తలకు బుహారీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈఏడాది ఫిబ్రవరి 23న నైజీరియాలో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. అయితే, ఎన్నికల సమయంలో పలు ప్రాంతాల్లో రిగ్గింగ్ జరిగిందనే ఆరోపణలపై హింసాత్మక అల్లర్లు చెలరేగాయి. దీంతో, పలుచోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. మార్చి9న ఎన్నికలు ముగిసాయి. ఈ ఎన్నికల్లో ఏపీసీ (ఆల్ ప్రొగ్రెసివ్ కాంగ్రెస్) పార్టీ నేత బుహారీ... తన సమీప ప్రత్యర్థి, పీడీపీ ( పీపుల్స్ డెమోక్రసీ పార్టీ ) నేత అటీకు అబూబకర్పై గెలుపొందారు. నైజీరియా ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం...బుహారీకి 1,51,91,847 ఓట్లు రాగా, అబూబకర్కు 1,12,62,978 ఓట్లు వచ్చాయి. 30లక్షల ఓట్ల మెజారిటీతో బుహారీ గెలుపొందారు. వచ్చేనెల 12న దేశాధ్యక్షుడిగా ఆయన రెండోసారి ప్రమాణం చేయనున్నారు.