Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడుగురు ఉగ్రవాదులు హతం
బాగ్దాద్ : ఐఎస్ శిబిరాలపై ఇరాక్ సైన్యం వైమానిక దాడికి పాల్పడింది. ఈ దాడుల్లో ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఐఎస్ శిబిరాల్లోని ఆయుధాలు, క్షిపణులు, పేలుడు పదార్ధాలు ధ్వంసమైనట్టు ఇరాక్ ఆర్మీ వెల్లడించింది. కాగా, నినేవి ప్రావిన్స్లోని సినేర్, బాషికా పట్టణాల్లో దాదాపు 6లక్షల యాజిదీ మైనారిటీలు నివసిస్తున్నారు. 2014లో ఈ పట్టణాలపై దాడులకు పాల్పడ్డ మిలిటెంట్లు యాజిదీలను హతమార్చారు. మహిళలను బలవంతంగా ఎత్తుకెళ్లారు. ఐఎస్ చెరలో ఉన్న యాజిదీ మహిళలకు విముక్తి కల్పించేందుకు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నామని జాయింట్ ఆపరేషన్ కమాండ్ వెల్లడించింది.