Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరుగురి మృతి
కాబూల్ : అఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో ఆత్మాహుతి దాడి జరిగింది. సైనిక శిక్షణా కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకొని మిలిటెంట్లు జరిపిన దాడిలో ఆరుగురు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సైనిక ఆస్పత్రికి తరలించి చికిత్స అంది స్తున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. అఫ్ఘాన్ ఆర్మీ వెల్లడించిన వివరాల ప్రకారం....మార్షల్ ఫహీమ్ నేషనల్ డిఫెన్స్ వర్సిటీ ప్రాంగణం ప్రవేశద్వారం వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఆరుగురు మృతి చెందారు. ఈ దాడికి పాల్పడినట్టు ఏ ఉగ్రసంస్థ కూడా ప్రకటించుకోలేదు. అయితే, ఇటీవల జరిగిన పలు దాడులకు బాధ్యత వహిస్తున్నట్టు తాలిబన్లు ప్రకటించుకున్నారు. ఈదాడి కూడా తాలిబన్ల పనేనని ఆర్మీ అధికారులు అనుమానిస్తున్నారు.