Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్కు అమెరికా హెచ్చరిక
వాషింగ్టన్ : రష్యా నుంచి ఎస్-400 క్షిపణి వ్యవస్థలను కొనుగో లు చేయాలని కేంద్రం నిర్ణయించిన నేప థ్యంలో ఈ కొనుగోళ్ల ద్వారా రక్షణ రంగ ఒప్పందాల్లో చిక్కులు తలెత్తుతాయని అమెరికా హెచ్చరించింది. కౌంటరింగ్ అమెరికాస్ అడ్వైజరీస్ త్రూ శాంక్షన్ యాక్ట్ (సీఏఏటీఎస్ఏ) ప్రకారం మాస్కో నుంచి భారత్ ఎస్-400 క్షిపణులను కొనుగోలు చేస్తున్న అంశం చాలా ప్రాధాన్యమైన అంశంగా అమెరికా అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో క్షిపణుల కొనుగోలులో భారత్ మొగ్గు చూపినట్టయితే రక్షణ రంగ ఒప్పందాల్లో చిక్కులు తప్పవని అమెరికా హెచ్చరించింది. ఉపరితలం నుంచి గగతలంలోకి లక్ష్యాలను ఛేదించగలిగే సామర్థ్యం దీర్ఘశ్రేణి ఎస్-400 క్షిపణులకు ఉంది. ఈ క్షిపణులను రష్యా నుంచి కొనుగోలు చేసేందుకు చైనా 2014లో మొదట ఒప్పందం కుదుర్చుకోగా.. కేంద్రం గతేడాది అక్టోబర్5న ఒప్పందం కుదుర్చుకుంది. 5 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందంపై గత ఏడాది అక్టోబర్లో ఇరు దేశాధినేతలు సంతకాలు చేశాయి. వచ్చేఏడాది అక్టోబర్ నెలలో ఎస్-400 క్షిపణులను భారత్కు రష్యా ఎగుమతి చేయనుంది. ఇలాంటి తరుణంలో ఈ ఒప్పందానికి తూట్లు పొడవాలని అమెరికా కుట్ర పన్నింది. ఇదిలా ఉండగా, ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్న టర్కీపై అమెరికా ఆంక్షలు మోపిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని టర్కీపై ఒత్తిడి పెంచింది. తాజాగా, రష్యా నుంచి ఎస్-400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేయొద్దంటూ భారత్పై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నది.