Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోటీలో గెలుపొందిన వారిలో ఆరుగురు ప్రవాస భారతీయులు
- ఒక్కో విజేతకు రూ.34.5 లక్షల నగదు పురస్కారర
వాషింగ్టన్ : అమెరికాలోని స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్బీ సంస్థ నిర్వహించిన స్పెల్లింగ్ టెస్ట్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. ఈ పోటీ చివరి రౌండ్లో ఎనిమిది మంది విద్యార్థులు విజేతలుగా నిలిచారు. వీరిలో ఆరుగురు ప్రవాస భారతీయ చిన్నారులు ఉన్నారు. ఒక్కో విద్యార్థికి 50,000 డాలర్ల ( రూ.34.5 లక్షలు) నగదు పురస్కారం, 2500 డాలర్ల ( రూ.1.7 లక్షల) సేవింగ్స్ బాండ్, ప్రశంసాపత్రంతో పాటు పలు రిఫరెన్స్ పుస్తకాలు అందజేసినట్టు పోటీ నిర్వాహకులు వెల్లడించారు. కాగా, యూఎస్ స్పెల్బీ పోటీలో గత 12ఏండ్ల నుంచి తెలుగు విద్యార్థులే ముందంజలో ఉండటం పట్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో ఆంగ్లభాషా పరిజ్ఞానాన్ని పెంపొందించే లక్ష్యంతో 1925 నుంచి స్పెల్బీ పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. నిఘంటువుల నుంచి సేకరించిన అత్యంత కఠినమైన పదాల స్పెల్లింగ్లను ప్రవాస భారతీయ చిన్నారులు అవలీలగా ఉచ్ఛరించడం తనను సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తిందని పోటీ నిర్వాహకుడు జాక్వెస్ బెయిలీ తెలిపారు. మూడు రోజుల పాటు పోటీలు నిర్వహించామని అన్నారు. ఈ పోటీలో కెనడా, బహామా, ఘనా, జమైకా, జపాన్, దక్షిణ కొరియా, అమెరికా దేశాల నుంచి వేలాది మంది చిన్నారులు పాల్గొన్నారని అన్నారు.