Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: భారత్కు ప్రాధాన్య వాణిజ్య హౌదా(జీఎస్పీ) తొలగింపు విషయంలో వెనక్కి తగ్గేది లేదని ట్రంప్ సర్కార్ పునరుద్ఘాటించింది. భాజపా నేతృత్వంలోని ఎన్డీయే అఖండ విజయానికి శుభాకాంక్షలు తెలిపిన అమెరికా.. మోడీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేసిన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. భారత్కు జీఎస్పీ హౌదా రద్దు ఇప్పటికే ముగిసిన ప్రక్రియ అని అధికారులు పేర్కొన్నారు. ఈ విషయంలో అమెరికా ఇచ్చిన 60 రోజుల గడువు మే 3తో ముగిసింది. అయితే, భారత్లో సార్వత్రిక ఎన్నికలు ముగిసేంత వరకు జీఎస్పీ రద్దుపై ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని కొందరు యూఎస్ కాంగ్రెస్ సభ్యులు కోరడంతో దీనిపై తదుపరి నిర్ణయం ఆగిపోయింది. భారత్తో పాటు టర్కీకి కూడా విధించిన గడువు ముగియడంతో మే 17న ఆదేశానికి జీఎస్పీ హౌదాను రద్దు చేసినట్టు ట్రంప్ ప్రకటించారు.
భారత్లో ఎన్నికల ముగియడంతో ఇక త్వరలో ట్రంప్ నుంచి ఓ ప్రకటన రావచ్చునన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇరుదేశాల మధ్య నెలకొన్న కొన్ని వాణిజ్య చిక్కులను పరిష్కరించుకోగలిగితే కొన్ని రాయితీలు కల్పించే అవకాశాన్ని కొట్టిపారేయలేమని అధికారులు తెలిపారు. దీనిపై ఇరు దేశాలు విస్త త చర్చలు జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అమెరికా ఉత్పత్తులకు భారత మార్కెట్లలో అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడంపై భారత్ నుంచి ఎటువంటి భరోసా లభించకపోవడం వల్ల భారత్కు ప్రాధాన్య వాణిజ్య హౌదా రద్దు చేయాలని మార్చిలో కాంగ్రెస్కు ట్రంప్ లేఖ రాసిన విషయం తెలిసిందే. అమెరికా వస్తువులపై భారత్ అత్యధిక పన్నులు విధిస్తోందన్నది ట్రంప్ వాదన. మరోవైపు జీఎప్పీ తొలగింపు వల్ల భారత్ ఎగుమతులపై పెద్దగా ప్రభావం ఉండదని భారత్లోని వాణిజ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్ జీఎస్పీలో భాగంగా ఉండటంతో 2017లో 5.6బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసింది. వచ్చేనెలలో ఒసాకాలో జీ-20 సభ్య దేశాల సదస్సు జరుగనుంది. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని మోడీ కూడా హాజరు కానున్నారు. ఈ సదస్సులో ఇరుదేశాధినేతలు ఈ అంశంపై చర్చించే అవకాశముంది.
మెక్సికో దిగుమతులపై 5శాతం సుంకం
మెక్సికో దిగుమతులపై వచ్చేనెల10 నుంచి 5శాతం సుంకం పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అక్రమ వలసదారులను నిరోధించడంలో మెక్సికో పూర్తిగా విఫలమైందని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రతీనెల మెక్సికో నుంచి దిగుమతవుతున్న వస్తువులపై 5శాతం పన్ను వసూలు చేస్తామన్నారు. అక్టోబర్ 1నాటికి మెక్సికో దిగుమతులపై 25శాతం సుంకం వసూలు చేస్తామని వెల్లడించారు. ఇకపై మెక్సికో ఉత్పత్తుల ధరలు అమెరికాలో బాగా పెరిగే అవకాశముంది. మెక్సికో నుంచి అమెరికాలోకి అక్రమ వలసలు ఆగే వరకు ఈ పన్ను విధింపు నిర్ణయం కొనసాగుతుందని ట్రంప్ ట్విటర్లో స్పష్టంచేశారు. అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని ఉపయోగించి ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు వైట్హౌస్ వెల్లడించింది. అమెరికా- మెక్సికో సరిహద్దులోని ఎల్ పాసో వద్ద అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న 1036 మందితో కూడిన వలసదారుల గుంపును సరిహద్దుదళం గుర్తించిన మరుసటి రోజే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్రమ వలసల కారణంగా దేశ భద్రతకు, ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు తలెత్తుతాయని ట్రంప్ ఆరోపిస్తున్నారు.
మెక్సికన్లంటే ట్రంప్కు చులకన భావం ఉందని ఉత్తర అమెరికాలో మెక్సికో దౌత్యవేత్త జీసస్ సీడ్ విమర్శించారు. మెక్సికన్లంతా డ్రగ్స్కు బాని సలని, దొంగలని, అక్రమ చొరబాటుదారులనే భావాలు ట్రంప్లో ఉన్నాయని అన్నారు. యూఎస్ సరిహద్దు గస్తీ బలగాలు మెక్సికన్ వలసదారులను వేధింపులకు గురిచేస్తున్నాయని మండిపడ్డారు. మెక్సికో ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు ట్రంప్ కుట్రపన్నారని అన్నారు. ఈఏడాది ఫిబ్రవరిలో అమెరికా-మెక్సికో సరిహద్దులో నేషనల్ ఎమర్జెన్సీ విధించారని అన్నారు.