Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: 2020 అధ్యక్ష ఎన్నికలప్రచారాన్ని తాను ఈ నెల 18న లాంఛనంగా ప్రారంభిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఫ్లోరిడాలోని ఆర్లాండో ఆమ్వేసెంటర్లో 20వేల మంది ప్రజలతో భారీ ర్యాలీ నిర్వహిస్తానని అందులో తనభార్య మెలనియా, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్,ఆయన భార్య కారెన్ పాల్గ్గొంటారని ట్రంప్ శనివారం ఒక ట్వీట్లో పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక ర్యాలీలో మాతో కలవండంటూ ఆయన ప్రజలను ఆహ్వానించారు. తన ఎన్నికల ప్రచారానికి, నెలల తరబడి రాజకీయ ర్యాలీల నిర్వహణకు సంబంధించి ట్రంప్ ఇప్పటికే నిధుల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఫ్లోరిడాను రెండో ఇంటిగా పరిగణిస్తున్న ట్రంప్ 2016లో ఇక్కడి నుండే విజయం సాధించిన విషయం తెలిసిందే. 2020 ఎన్నికల్లో ట్రంప్ గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వుంటుందంటున్న పరిశీకులు ఆయన విజయం నల్లేరు మీద నడక కాబోదని స్పష్టం చేస్తున్నారు. ట్రంప్ తన పదవీకాలంలో అనుసరించిన విధానాలు ఆయన రెండో సారి ఎన్నికయ్యేందుకు సహకరించవని డెమొక్రాట్ నేతలు చెబుతున్నారు. డెమొక్రాట్స్ తరపున బరిలోకి దిగుతున్న జోబిడెన్ ట్రంప్కు గట్టిపోటీ ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.