Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 12 మంది మృతి, పలువురికి గాయాలు
వాషింగ్టన్: అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో ప్రజాపనులశాఖ కార్యాలయంలో పనిచేసిన మాజీ ఉద్యోగి ఒకరు శుక్రవారంనాడు కార్యాలయంలోకి ప్రవేశించి విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో కనీసం12మంది మరణించారని, పలువురు గాయపడ్డారని పోలీసు అధికారులు చెప్పారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని జరిపిన కాల్పుల్లో అతడు మరణించాడని పోలీస్ ఛీఫ్ జేమ్స్ సెర్వెరా మీడియాకు చెప్పారు. దుండగుడి కాల్పుల్లో 12 మంది అక్కడికక్కడే మరణించగా, తీవ్రంగా గాయపడిన మరో ఆరుగురిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించామని ఆయన వివరించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి వెంటనే తెలియరాలేదని ఆయన చెప్పారు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం4గంటలకు వర్జీనియాబీచ్ మున్సిపల్ కాంప్లెక్స్ భవన సముదాయంలోకి ప్రవేశించి కాల్పులు ప్రారంభించాడని సెర్వెరా వివరించారు.
ఆ కార్యాలయ మాజీఉద్యోగి కావటంతో ఈ దురంతానికి పాల్పడతాడని ఎవరూ ఊహించలేదన్నారు. క్షతగాత్రుల్లో ఒక పోలీసు అధికారికూడా వున్నారని, ఆయన బుల్లెట్ప్రూఫ్ జాకెట్ ధరించటంతో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడని చెప్పారు. వర్జీనియా బీచ్ చరిత్రలో ఇదొక దుర్దినమని మేయర్ బాబీ డయ్యర్ ఆవేదన వ్యక్తం చేశారు.