Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్: యూకేలో భారతీయ విద్యార్థుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. 2012లో యూకే ప్రభుత్వం ఆ దేశానికి విదేశీ విద్యార్థుల ప్రవాహాన్ని అడ్డుకోవడానికి విద్యార్థి వీసాలపై (టైర్-4 వీసాలు) ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. 2011-12లో 39,090 మంది భారతీయ విద్యార్థులుండగా ఆ సంఖ్య 2016-17 నాటికి 16,550కి తగ్గింది. దీంతో యూకేకు వెళ్తున్న భారతీయుల సంఖ్య తగ్గుతోందనే అభిప్రాయపడ్డారు. కానీ 2019మార్చిలో ఆసంఖ్య అనూహ్యంగా పెరిగింది. 2018 మార్చితో పోలిస్తే 2019లో 40శాతం పెరిగి ఆ సంఖ్య 21,165కు చేరింది. యూకేలోని విదేశీ విద్యార్థుల్లో చైనా, భారత్కు చెందిన వారే 50శాతంపైగా ఉన్నారు. అదేవిధంగా యూకేలో వర్క్ వీసా(టైర్ -2)పైనా పని చేయడానికి భారతీయ కార్మికులు అధికంగా ఆసక్తిని కనబరుస్తోన్నారు..వీరి శాతం గతేడాది కేవలం 10శాతం ఉండగా ప్రస్తుతంగా 53 శాతానికి పెరిగింది. అలాగే యూకేను సందర్శించిన భారతీయుల సంఖ్య 12 శాతం పెరిగింది.