Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్మీ కాల్పుల్లో ఇద్దరు నిరసనకారులు మృతి,
10 మందికి గాయాలు
ఖార్తౌమ్ : ఆర్మీ పాలనను వ్యతిరేకిస్తూ సుడాన్ రాజధాని ఖార్తౌమ్లో చెలరేగిన నిరసనలు ఉద్రిక్తతకు దారి తీశాయి. శాంతియుతంగా ర్యాలీ తీసిన నిరసనకారులపై సుడాన్ సైనికులు విరుచుకుపడ్డారు. నిరసనకారులపై లాఠీలు ఝళిపించారు. బాష్పవాయుగోళాలు ప్రయోగించారు. అంతటితో ఆగకుండా నిరసనకారులపై సుడాన్ సైన్యం కాల్పులకు తెగబడిటనట్టు ప్రత్యక్ష సాక్ష్యులు ఆరోపిస్తున్నారు. సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు నిరసనకారులు మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డారు. అనంతరం నిరసనకారులు ఆర్మీ హెడ్క్వార్టర్స్లో చొరబడేందుకు ప్రయత్నించారు. దీంతో, ఈ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఆర్మీ హెడ్క్వార్టర్స్ను పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ చుట్టుముట్టింది.