Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తైవాన్, దక్షిణ చైనా సముద్ర జలాల వివాదాల్లో...
- అమెరికాకు చైనా హెచ్చరిక
సింగపూర్ : తైవాన్, దక్షిణచైనా సముద్ర జలాల వివాదాల్లో తలదూర్చాలని చూడొద్దని చైనా రక్షణ మంత్రి వీఫెంఘీ అమెరికాను ఘాటుగా హెచ్చరించారు. చైనా సార్వభౌమత్వాన్ని దెబ్బతీ సేలా వ్యవహరిం చినట్టయితే అమెరికా తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని అన్నారు. ఒకవేళ యుద్ధం సంభవించినట్టయితే ప్రపంచ దేశాలకు అనర్థమేని అన్నారు. తైవాన్ జలాల్లో యూఎస్ తమ నావికాదళాన్ని మోహరించి కయ్యానికి కాలు దువ్వుతోందని విమర్శించారు. సింగపూర్లోని షాంగ్రిలా సదస్సులో ఆయన మాట్లాడారు. ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని చైనా ఏనాడూ భావించదన్నారు. అయితే, ఒకవేళ ఎవరైనా తమ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించినట్టయితే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు. చైనాతో ప్రాంతీయ సుస్థిరతకు ముప్పుఉందని అమెరికా రక్షణమంత్రి పాట్రిక్ షనాహన్ చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం తీవ్రంగా స్పందించిన వీఫెంఘీ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా నావికాస్వేచ్ఛ పేరిట తైవాన్ జలసంధిగుండా పలుమార్లు నౌకలను పంపుతుండటాన్ని తీవ్రంగా ఖండించిన చైనా తాము అనుసరిస్తున్న 'వన్చైనా' విధానాన్ని గౌరవించాలని సూచించింది. దేశ జాతీయ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునే విషయంలో తమ సామర్ధ్యాన్ని తక్కువగా అంచనా వేయవద్దని అమెరికాను హెచ్చరించారు. ఇటీవలి కాలంలో చైనా-అమెరికా వాణిజ్యపోరుతో పసిఫిక్ ప్రాంతంలో ఉద్రిక్తతలు చెలరేగుతున్న నేపథ్యంలో ఈప్రాంతంలో ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తమ సైన్యానికి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.