Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 79 మందికి గాయాలు
మాస్కో : రష్యాలోని టీఎన్టీ తయారీ కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 79 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. సెంట్రల్ రష్యా ప్రాంతంలోని జెర్జింక్ నగరంలో పేలుడు సంభవించింది. ఈ భారీ పేలుడు కారణంగా కర్మాగారానికి సమీపంలోని 200 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. పేలుడు కారణంగా కర్మాగారంలో పనిచేస్తున్న 38 మంది ఉద్యోగులతోపాటు 41 మంది స్థానికులు కూడా గాయపడినట్టు వెల్లడించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు.