Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిడ్నీ : ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఓడరేవులో చైనా యుద్ధనౌకలు ప్రవేశిం చాయి. ఈ యుద్ధనౌకల్లో 70 మంది చైనా సైనికులను గుర్తించినట్టు ఆస్ట్రేలియా పేర్కొంది. మధ్య ప్రాఛ్య దేశాల్లో డ్రగ్స్మాఫియాకు వ్యతిరేకంగా ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన చైనా నావికాదళం సోమవారం సిడ్నీ ఓడరేవుకు చేరుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. 'సిడ్నీ ఓడరేవులో చైనా యుద్ధనౌకల ప్రవేశం అందరికీ ఆశ్చర్యాన్ని కల్గించి ఉంటుంది...కానీ, మేం ఏమాత్రం ఆశ్చర్యపోవడం లేదు' అని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ అన్నారు. 'ఆస్ట్రేలియా యుద్ధనౌకలు గతనెలలో దక్షిణ చైనా సముద్ర జలాల్లో ప్రవేశించాయి. మా చర్యలకు ప్రతిచర్యగా మాత్రమే చైనా తమ యుద్ధనౌకలను మా ఓడరేవుకు పంపి ఉంటుంది. ఈ విషయాన్ని మేము అర్థం చేసుకోగలం. ఆస్ట్రేలియా సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశం చైనాకు లేదని మాకు తెలుసు' అని అన్నారు. ఇదిలా ఉండగా, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రక్షణరంగంపై ఎక్కువగా దృష్టిపెడుతున్నారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.