Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 8 మంది నవజాత శిశువులు మృతి
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ లోని సహివాల్ నగరం లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో అమాన వీయ ఘటన చోటుచేసు కుంది. ఆస్పత్రిలోని ఎయిర్కండీ షనర్లు (ఏసీలు) పనిచేయకపోవడంతో 8 మంది నవజాత శిశువులు మృతి చెందారు. ఈ ఘటనపై సహివాల్ డిప్యూటీ కమిషనర్ జమాన్ వాటూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సహివాల్లోని ప్రయివేట్ ఆస్పత్రిలోని ఏసీలు పనిచేయడంలేదని ఫిర్యాదు ఇచ్చినప్పటికీ ఆస్పత్రి యాజమాన్యం పట్టించుకోలేదని ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి కాల్ వచ్చిందన్నారు. రోగుల ఇబ్బందులపై స్పందించని ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలకు ఆదేశించామని అన్నారు. ఇలాంటి ఘటనలు ఆస్పత్రి యాజమాన్యం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు.