Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెగూసిగల్ప : హౌండ్యూరస్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తాయి. విద్య, ఆరోగ్య రంగాలను ప్రయివేటీకరించనున్నట్టు ప్రభుత్వం చేసిన ప్రకటనతో నిరసనలు హౌరెత్తాయి. సోమవారం రాజధాని తెగూసిగల్ప వీధుల్లో వేలాది మంది నిరసనకారులు చేరుకున్నారు. బ్యానర్లు, ప్లకార్డులు చేబూని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. అధ్యక్షుడు జువాన్ ఓర్లాండో హెర్నాండెజ్ పాలనో అవినీతి, హింసాత్మక ఘటనలు, ప్రజా వ్యతిరేక విధానాలు పెరిగిపోయాయని విమర్శించారు. నిరసనకారులు రహదారులపై బైఠాయించారు. వాహనాల రాకపోకలను స్తంభింప చేశారు. అధ్యక్షుడు జువాన్ ఓర్లాండో తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఆందోళనకారులపై పోలీసులు లాఠీలు ఝళిపించారు. బాష్పవాయుగోళాలు ప్రయోగిం చారు. ఈ ఘటనలో పలువురు నిరసనకారులు తీవ్రంగా గాయపడ్డారు. సిగుటెపేఖ్ నగరంలోని ఓ ప్రయివేట్ ఉపాధ్యాయుడిపై పోలీసులు జరిపిన కాల్పుల కారణంగా అతని కిడ్నీ పూర్తిగా దెబ్బతిన్నదని, ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు.