Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖార్టూమ్: తొమ్మిది నెలల్లో ఎన్నికలు నిర్వహించి అధికారాన్ని ప్రజా ప్రభుత్వానికి బదిలీ చేస్తామంటూ సూడాన్ సైనిక పాలకులు చేసిన ప్రతి పాదనలను అక్కడి ప్రతిపక్షం తీవ్రంగా వ్యతిరేకించింది. గత ఏప్రిల్లో అధ్యక్షుడు ఉమర అల్ బషీర్ను పదవి నుండి తొలగించి తాము పాలనా పగ్గాలు చేపట్టిన తరువాత వెల్లువెత్తుతున్న నిరసనలను సైన్యం ఉక్కుపాదంతో అణచివేస్తున్న విషయం తెలిసిందే. ఆ నిరసనల్లో భాగంగా సోమవారం రక్షణ మంత్రిత్వశాఖ క్యాంప్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపేందుకు వచ్చిన ప్రజలపై భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో 35 మంది మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. అల్ బషీర్కు ఉద్వాసన పలికి పాలనా పగ్గాలను చేపట్టిన సైనిక మండలి ప్రధాన ప్రతిపక్షంతో కుదిరిన అన్ని ఒప్పందాలను రద్దు చేసుకోవటంతో పాటు తాము ఎన్నికలను తొమ్మిది నెలల్లోపు నిర్వహించి ప్రజా ప్రతినిధులకు అధికారాన్ని బదిలీ చేస్తామని చెబుతోంది. అయితే తాము సైనిక మండ లిని గద్దె దించే వరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తామని ప్రతిపక్ష కూటమి నేత మదానీ అబ్బాస్ మదానీ స్పష్టం చేశారు. సైనిక మండలి పాలకుడు చేసిన ప్రతిపాదనలన్నింటినీ తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నా మన్నారు. సైనిక మండలి నిరసనకారులను కాల్చివేస్తూ, గాయపరుస్తూ అమానుషంగా ప్రవర్తిస్తోందని, సూడాన్ ప్రజలను అణచివేసేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు.